ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హనీ ట్రాప్ వ్యవహారం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది.ఎంతోమంది సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పరచుకొనే వారికి మాయమాటలు చెప్పి వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడే వాటిని రికార్డు చేస్తూ సదరు సెలబ్రెటీలను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వీరిని విచారించగా సంచలన నిజాలు బయటపడ్డాయి.

ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా మరొకరు మైనర్ గా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి పోలీసులు ఏకంగా 285 మంది నగ్న వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఏకంగా వందమంది సెలబ్రిటీల నగ్న వీడియోలు ఉండటం గమనార్హం. నిందితుల నుంచి పోలీసులు 12 నకిలీ ఖాతాలను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ విధంగా సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడతారని, ఈ విధంగా సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పరచుకొని వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. మరింత దగ్గరవుతారు. ఈ క్రమంలోనే వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ వాటిని రికార్డు చేసుకొని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు డార్క్వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతూ లక్షల్లో డబ్బులు పోగు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మాట్లాడుతూ మనకు తెలియని నంబర్ ల నుంచి మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాటిని యాక్సెప్ట్ చేయకపోవడం ఎంతో ఉత్తమమని, తెలియని వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ముంబై పోలీసులు హెచ్చరించారు.
































