టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిపై పలు ఆరోపణలతో కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు మాజీమంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదు చేశారు.

కాగా.. సోమిరెడ్డి పై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. శనివారం సోమిరెడ్డి.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, సెశ్రిత పై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందుతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాపారం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

































