Connect with us

Featured

జీవితంలో ఆ తప్పు ఎప్పటికీ చేయనంటున్న ఛార్మి..!!

Published

on

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన ఛార్మి కౌర్.. ఆ తర్వాత కొన్నాళ్ళకు హీరోయిన్ స్టేజ్ నుంచి తప్పుకొని నిర్మాతగా మారింది.. అయితే ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న కాలం నుంచే ఈమె పెళ్లి కి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో ప్రచారమయ్యాయి.. అంతేకాదు ఈ అమ్మడు హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న టైంలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో ప్రేమలో ఉందని.. అతణ్ని పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే కొన్నేళ్ల తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది.

ఆ తర్వాత కథానాయికగా ఛార్మి ప్రభ తగ్గడం మొదలయ్యాక ఛార్మి పెళ్లి గురించి కొన్ని సార్లు చర్చ వచ్చింది. కానీ ఆమె పూరి జగన్నాథ్ క్యాంపులో చేరిపోయి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సాగుతోంది. సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం కూడా ఆమె ‘లైగర్’ సినిమా పనిలో బిజీగా ఉంది.ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఛార్మి పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆమె పెళ్లి వైపు అడుగులు వేయబోతున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై ఛార్మి తనదైన శైలిలో స్పందించింది.తన పెళ్లి వార్తలపై ఛార్మి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో.. ”నేనిప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నా. నా జీవితం పట్ల చాలా సంతోషంగానూ ఉన్నాను. కాబట్టి పెళ్లి అనే తప్పును నా జీవితంలో ఎప్పటికీ చేయను” అనేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఓకే కానీ.. ఎప్పటికీ పెళ్లి చేసుకునేదే లేదు అని ఛార్మి ఖరాఖండిగా చెప్పేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Advertisement

ఇది పూరి జగన్నాథ్ ప్రభావంతో తీసుకున్న నిర్ణయమా అన్న చర్చ నడుస్తోంది జనాల్లో.పూరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు కానీ.. పెళ్లి విషయంలో ఆయనంత సానుకూల వ్యాఖ్యలు చేయడు. పాడ్ కాస్ట్‌ల్లో కూడా పెళ్లి గురించి కొంత ప్రతికూల వ్యాఖ్యలే చేశాడు. ఇక పూరి గురువు రామ్ గోపాల్ వర్మ సంగతి తెలిసిందే. పెళ్లి గురించి పూర్తి నెగెటివ్‌గా మాట్లాడతాడు. ఛార్మి మీద వీరి ప్రభావం బాగానే పడిందని.. అందుకే లైఫ్ లో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదనిఅంటోంది ఛార్మి..!!

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!