సమంత నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి మనకు తెలిసిందే.ఏం మాయ చేసావే సినిమా ద్వారా పరిచయమైన వీరు ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల నుంచి పరిచయమున్న వీరు 2017 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా కలిసి నటించిన ఈ జంట వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకుంది.

ఇలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ ఈ జంట గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో అందంగా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేస్తూ సినిమాలు తీయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదని ఈ క్రమంలోనే తనని సినిమాలు చేయవద్దని చెప్పడంతోనే సమంతకు నాగచైతన్యకు మధ్య వివాదాలు ఏర్పడ్డాయని అందుకే విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇలా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వారికి ప్రేమకు గుర్తుగా వారి చేతుల పై టాటూలను వేయించుకున్నారు. చైతుతో ఉన్న బంధం తనకు జీవితాంతం గుర్తు ఉండే విధంగా సమంత ఏకంగా తన శరీరంపై మూడు టాటూలను వేయించుకుంది. మొట్టమొదటిసారిగా వీరు కలిసి నటించిన ఏం మాయ చేసావే సినిమా గుర్తుగా సమంత తన మెడ పై YMC అనే టాటూ వేయించుకుంది.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే రకమైన గుర్తును వారి కుడి చేతి పై వేయించుకున్నారు. అలాగే సమంత చైతన్య సంతకాన్ని తన నడుము పై టాటూ వేయించుకుంది.ఈ విధంగా చైతన్య పై ఉన్న ప్రేమను టాటూల రూపంలో తన శరీరంపై పదిలంగా దాచుకున్న సమంత నేడు విడాకులు తీసుకోవడం అభిమానులను ఎంతో కలచివేస్తోంది.



























