Chiranjeevi: ఇటీవల హైదరాబాదులో జరిగిన స్కూల్ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా నిందితుడికి తప్పనిసరిగా శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. డిపిఏ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అందరిని ఎంతగానో కలచివేసింది.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం నన్ను బాగా కలిసి వేసింది. అటవీక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాల వికృతి చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షను వేగవంతం చేయాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చిన్నారి ఘటనపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఎంతోమంది తీవ్రస్థాయిలో ఖండిస్తూ నిందితుడికి శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ఈ విషయంపై స్పందిస్తూ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే తన డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Chiranjeevi: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి..
నాలుగేళ్ల చిన్నారి ఘటన అనంతరం తెలంగాణ ప్రభుత్వం అన్ని పాఠశాలలో తప్పనిసరిగా కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టడమే కాకుండా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేశారు.అయితే కొన్ని పాఠశాలలో ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు జరుగుతుండడంతో విద్యాశాఖ మరిన్ని పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టనుంది.































