Padma Sri Ramachandraiah: ఇటీవల పద్మ అవార్డులు పొందిన వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఇప్పటికే కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యాకు రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన కళాకారులకు నగదుతో పాటు ఇంటి స్థలాలు ఇచ్చి సత్కరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం . తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం గౌరవించుకుంది.

అతనికి సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఇంటిస్థలంలో పాటు నిర్మాణ ఖర్చుకు రూ. కోటి రివార్డ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డ్ అందుకున్న నేపథ్యంలో మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు..
అంతరించిపోతున్న ఆదివాసీ కళలను బతికిస్తున్నందుకు అవార్డ్ గ్రహీతలను సీఎం కేసీఆర్ అభినందించారు. కళలకు వీరు చేసిన సేవలను కొనియాడారు. పద్మశ్రీ అవార్డ్ పొందడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ను కలిసిన సమయంలో రామచంద్రయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిస్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావును ఆదేశించారు. గతంలో కూడా పద్మ శ్రీ పొందిన తెలంగాణ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా తన జిల్లా కేంద్రంలో ఇంటి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. కోటిని సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కను సీఎం ఆదేశించారు.































