Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఏం చేసినా అది ఒక సంచలనంగా మారుతుంది.ఈమె పలు సినిమాల్లో నటిగా నటించినా రాని గుర్తింపు సోషల్ మీడియా వేదికగా వివాదాస్పదమైన ట్వీట్లు ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక వార్త ద్వారా నిత్యం సోషల్ మీడియా వార్తల్లో నిలిచే పూనమ్ గత రెండు రోజుల నుంచి వరుస ట్వీట్లతో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి వాట్సాప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ మరొక ట్వీట్ ద్వారా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలనమైన పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ… ఏం జరిగినా కూడా నేను భావోద్వేగాల గుండా ప్రయాణించాల్సి వస్తోంది ఇలా వెళ్లడం సులభమైన విషయం కాదు… నాలుగు సంవత్సరాల కథ అయితే తొలిసారిగా పాజిటివ్ అని తెలియడంతో ఈ పోస్ట్ చేస్తున్నాను. ఆ భగవంతుడు ప్రజలను షరతులు లేని ప్రేమ కొంచెం కృతజ్ఞత, బాధ్యతలతో ఆశీర్వదిస్తాడు అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి…
పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. నాలుగు సంవత్సరాల కథ ఏంటి పాజిటివ్ రావడం ఏంటి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా గత రెండు రోజుల నుంచి పూనమ్ సంచలనమైన ట్వీట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
No matter what happen I am forced to go thru the same emotions ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022
It’s not easy : story for four years ,
But for the first time it was positive . So posted .
‘God bless people with some gratitude and responsibility for the unconditional love’#peace #omshanti































