ప్రజలను కోవిడ్ భయపడుతుంది. ఇప్పటికే ఫస్ట్ సెకండ్ వేవ్ రూపంలో లో ప్రజలను పట్టి పీడించింది. ప్రస్తుతం మూడో ముప్పు కలవరపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ వచ్చిన వారిలో పలురకాల దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం, ఒంటి నొప్పుల వంటి పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి.

కొత్తగా కోవిడ్ వచ్చిన వారిని డయాబెటిస్ కలవరపెడుతోంది. ఇటీవల వచ్చిన వారి రక్తంలో అధిక స్థాయి షుగర్ నమోదై కొన్ని రోజుల వరకు ఇన్ఫెక్షన్ ఉంటున్నట్లు రీసెర్చర్లు గుర్తించారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చర్లు..కొవిడ్ వచ్చిన 551మంది హెల్త్ కండిషన్ ను ఇటలీలోని మార్చి 2020 నుంచి మే 2020వరకూ గమనించారు.వారిలో సగం మంది అంటే 46శాతం పేషెంట్ల డయాబెటిస్ (హైపర్గ్లేసెమియా) లక్షణాలు కనిపించలేదు. 35శాతం మందిలో లక్షణాలు కనిపించి కనీసం ఆరు నెలల పాటు అలాగే ఉన్నాయి.
నెఫ్రాలజీ డివిజన్ కు చెందిన పౌలో ఫియోరినా అనే రచయిత ఈ విషయాలను కన్ఫామ్ చేశారు. గ్లూకోస్ అసమతుల్యత ఉన్న పేషెంట్ తో పోలిస్తే హైపర్ గ్లెసేమియా పేషంట్ లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వారికి వెంటిలేషన్ సౌకర్యం కూడా అందించాల్సి వస్తోంది. ఈ రకం డయాబెటిస్ వచ్చిన వారిలో హార్మోన్ సమతౌల్యత సరిగ్గా లేని కారణంగా శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతున్నట్లు వెల్లడైంది.
































