Prashanth Neel: దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చించుకుంటున్న సినిమాలలో కేజిఎఫ్ 2 ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా రికార్డులు సృష్టించడంతో ఒక్కసారిగా హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగి పోతున్నాయి.Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!
ఈ విధంగా ఈ సినిమా విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా కేజిఎఫ్2 లో హీరో తల్లి ముంబైలో చనిపోతే పూడ్చిన మట్టితో సహా తీసుకువచ్చి కేజీఎఫ్ లో సమాధి కట్టిస్తాడు.Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ ఇది నా నిజ జీవితంలో చేయాలనుకున్నా, అయితే ప్రాక్టికల్ గా కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని పెట్టానని డైరెక్టర్ వెల్లడించారు. తనకు తన నానమ్మ అంటే ఎంతో ఇష్టమని ప్రశాంత్ ఈ సందర్భంగా వెల్లడించారు.
మా నాన్నమ్మ నిత్యం నా వెంటే ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నేను తినకపోతే దగ్గరుండి తినిపించేది. ఈ విధంగా తనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తను చనిపోయిన తర్వాత తనని పూడ్చి పెట్టడానికి మాకంటూ ఇక్కడ సొంత స్థలం లేక తనని మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లి పూడ్చి పెట్టాము.ఎప్పటికైనా తన సమాధిని తీసుకువచ్చి నా ఇంటి వాకిట్లో పెట్టుకోవాలన్నది నా కల.అది కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించామని వెల్లడించారు.
ఈ విధంగా ప్రశాంత్ నీల్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేయడంతో ఎంతోమంది తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తండ్రి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా కాగా తల్లి కర్ణాటకకు చెందిన వ్యక్తి. మొత్తానికి ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తెలుగు వ్యక్తి కావడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.