Dil Raju: తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఆయా పార్టీలు ఎంతో బిజీగా గడుపుతున్నాయి.

ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. దీంతో ఈ విషయం కాస్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమైంది. కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
దిల్ రాజు కేసీఆర్ ని కలవడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. క్రమంలోనే దిల్ రాజు ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పెళ్లి వేడుకలలో బిజీగా ఉన్నటువంటి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కలిసి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
వివాహ ఆహ్వానం..
ఈ క్రమంలోనే కేసీఆర్ ని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
































