Doctor Peddeswara Rao : 2020 నుండి కరోనా వ్యాధి ఎలా చుక్కలు చూపించిందో అందరికీ అనుభవమే. ఇక కరోనా వాక్సినేషన్ తరువాత కరోనా సోకదు అనుకున్నా మళ్ళీ కరోనా సోకి చాలా మంది మరణించారు కూడా. అయితే వాక్సిన్ వల్ల చాలా వరకు కరోనా కేసులు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే మళ్ళీ చైనాలో కేసులు పెరగటంతో మళ్ళీ భారత్ లో కరోన గురించిన భయం మొదలయినా మనకు ఆ ఎఫెక్ట్ ఉండదని ప్రభుత్వం చెప్పడం కాస్త ఊరట కలిగించింది. అయితే కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్లకే గుండెపోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. కరోనా ప్రభావం అలాగే వాక్సిన్ ప్రభావం వల్లే ఇలా ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తున్నారనే వదంతుల నడుమ నిజానిజాలను డాక్టర్ పెద్దేశ్వరరావు చెప్పారు.

కరోనా వాక్సిన్ వల్ల గుండెనొప్పి…
కరోనా వ్యాధి ప్రభావం సోకిన తరువాత మూడు నెలలు ఉంటుందని, మనకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణం గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు బ్లాక్ అవడం. కరోనా సమయంలో అది జరుగుతుంది కానీ అది కేవలం మొదటి మూడు నెలలు ఉంటుంది. అందుకే ఆ సమయంలో డాక్టర్లు ఏకోస్పిన్ టాబ్లెట్ ను రోగులకు అందిస్తారు. కారోనా అయిపోయి మనకు చాలా కాలం అయింది. అలాగే వాక్సినేషన్ వల్ల కూడా గుండె పోట్లు ఎక్కువవుతున్నాయి అన్న సందేహలకు డాక్టర్ పెద్దెశ్వరరావు గారు మాట్లాడుతూ అది కూడా అపోహ అంటూ తెల్చేశారు.

కరోనా వాక్సిన్ వేయించుకుంటే ఆ కరోనా పార్టీకల్స్ కొన్నింటిని మన శరీరంలోకి పంపి మన రోగ నిరోధక శక్తిని పెంచుతారు అదే వాక్సిన్ మెకానిజం. దానివల్ల గుండెపోటు రావడం అనేది అపోహ మాత్రమే. నిజానికి చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, మితి మీరిన కసరాత్తులు అలాగే నిద్ర సమయాలు కారణం అంటూ చెప్పారు. మొన్నటి పునీత్ రాజ్ కుమార్ నుండి నేటి తారకరత్న వరకు యువకులే మరణించడానికి మారిన జీవన సరళి కారణం అంటూ చెప్పారు.































