అక్రమం మాదకద్రవ్యాల రవాణా నానాటికీ పెరిపోతుంది. ఎన్ని సార్లు అధికారులు పట్టుకున్నా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ హెరాయిన్ను పట్టుకున్నారు అధికారులు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు 12 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద సుమారు రూ.78కోట్ల విలువైన హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు.

దీనితో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయమే ఎనిమిది కిలోల హెరాయిన్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.53కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.































