Connect with us

Featured

బియ్యానికి పోషకాల జోడింపు.. త్వరలోనే కొత్త బియ్యం పంపిణీ..!

Published

on

పోషకాహారంపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అందులో కొంతమంది వినేవాళ్లు.. మరికొంత మంది పెడచెవిన పెట్టేవాళ్లు ఉన్నారు. అయితే కారోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా.. పోర్టిఫికేషన్ రైస్ ను 2024 నాటికి ప్రజలకు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నాడు.

బియ్యానికి పోషకాల జోడింపు ద్వారా ఆరోగ్యం అందించాలనేది ఫోర్టిఫికేషన్ ప్రధాన ఉద్దేశం. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే.. బియ్యానికి అదనంగా ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు కలపడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. దీనిని FSSAI నిర్వహించింది. రైస్ ఫోర్టిఫికేషన్ అనేది సాధారణ బియ్యానికి సూక్ష్మపోషకాలను జోడించే ప్రక్రియ. ఇలా కలిపిన బియ్యాన్ని పీడీఎస్ ల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం కోటింగ్, డస్టింగ్ పద్దతులు ఉన్నాయి. ఇండియాలో రైస్ ఫోర్టిఫికేషన్ కోసం ‘ఎక్స్‌ట్రాషన్’ అనేది మంచి టెక్నాలజీ అని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేసిన వాటిని 12 నెలల లోపు వినియోగించాలని తెలిపారు. ఇండియాలో ఇప్పటికీ చాలామంది మహిళలు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారని అంచానా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా భారత్ స్థానం 94. దీంతో ఈ ర్యాంక్ భారత్ లో ఆహార కొరత ఎంత ఉందనేది చూపిస్తుంది. అందువల్ల పేద ప్రజలు వినియోగిస్తున్న బియ్యానికి సూక్ష్మపోషకాలను కలిపి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఇళ్లలో సాధారణంగా అన్నం వండే పద్ధతిలోనే ఈ ఫోర్టిఫైడ్ రైస్‌తో అన్నం వండుకోవచ్చు. మన దేశంలో దాదాపు 2,690 రైస్ మిల్లులు ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేయడానికి బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి మూడు సూక్ష్మపోషకాలు ఉండే FRK ఉత్పత్తికి ఖర్చు కిలోకు 60 పైసల వరకు మాత్రమే అవుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. బలవర్థకమైన బియాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు 2019-20లో పైలట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌.. వంటి 15 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో పైలట్ పథకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఫోర్టిఫైడ్ రైస్ ను ఏడు దేశాలు పంపిణీ చేస్తున్నాయి. అందులో అమెరికా, పనామా, కోస్టా రికా, నికరాగ్వా, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, సోలొమన్ ఐలాండ్స్.. వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!