వర్షాకాలాన్ని చాలామంది వ్యాధుల కాలం అని కూడా అంటారు. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీంతో ఆ వ్యాధులతో పాటు పాటు జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతిని ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు చుట్టుముడతాయి. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వార్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతుంటారు.

జంక్ ఫుడ్ ను నివారించడంతో పాటు వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోడ్ల పక్కనే అమ్మే తిను బండారాలకు ఎంత వీలుంటె అంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు ఆటకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్కు దారితీస్తుంది.
మీరు తీసుకునే ఆహారం వర్షాకాలం సీజన్ లో మాత్రం తప్పకుండా అల్లం, నిమ్మకాయను చేర్చుకుంటే జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడానికి వీలుంటుంది. పెరుగు లేదా మజ్జిక లాంటివి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపడే అవకాశం ఉంటుంది. నీటిని కూడా ఎక్కువగా తాగాలి. పచ్చి కూరగాయలను అస్సలు తినకూడదు. ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
రిఫైన్డ్ షుగర్ తినవద్దు. ఎందుకంటే ఇది వాపు, గట్ ఫ్లోరా బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. ఫ్రై చేసిన ఆహార పదర్థాలను అస్సలు తీసుకోవద్దు. ఆహారం తిన్న వెంటనే పడుకోకండి. తిన్న వెంటనే మంచినీళ్లు కూడా తాగొద్దు. కొద్ది సమయం తర్వాత వాటర్ తీసుకోవాలి. తిన్న ఆహారం మంచిగా జీర్ణం కావాలంటే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.




























