Connect with us

Featured

చేపలను కొనుగోలు చేస్తున్నారా.. అవి తాజా చేపలా.. కాదా.. అనేవి ఇలా తెలుసుకోండి..?

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడైనా నాన్ వెజ్ దుకాణంలో జనాలు గుంపులు గుంపులుగా కనపడతారు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకోవాల్స

Published

on

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడైనా నాన్ వెజ్ దుకాణంలో జనాలు గుంపులు గుంపులుగా కనపడతారు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకోవాల్సిందే. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏందంటే.. చేపల గురించి. మనం మార్కెట్లో లేదా మరేదైనా దుకాణంలో చేపలను తీసుకునే సమయంలో అవి తాజా చేపలా.. లేదా పాడైపోయినవా అనేవి గమనించకుండా తీసుకుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో కల్తీ మాయ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎది చూసిన కల్తీ వ్యాపారం నడుస్తోంది. ఇది చేపల దాకా కూడా పాకింది. ఎక్కవ శాతం జనాలు చేపలు తీసుకునే సమయంలో కేవలం ఆ చేప మొప్పలను ఎత్తి, చేపల లోపలి భాగంలో గులాబీ రంగులో ఉందో లేదో చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో మొప్పలకు గులాబీ కలర్ రంగు, ఎర్ర రంగులను కూడా పూస్తున్నారు. కేవలం ఇదొక్కటే చూసుకొని దీనిని కొనుగోలు చేయడం అనేది మంచిది కాదు.

Advertisement

తాజా చేపలను గుర్తించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీకు చేపలు మంచివా.. కావా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటుందని.. అంతే కాకుండా పోషకాలు మెండుగా ఉంటాయని చాలామంది చికెన్, మటన్ కంటే చేపలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా చేపలను తినడం వల్ల డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్ లో ఉంటాయి కూడా. అందుకే తాజాగా ఉండే చేపలు అంటే పాడైపోయినవి కాకుండా మంచిగా ఉన్నవి తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చేపలను వాసన చూడటం ద్వారా కూడా అవి తాజాగా ఉన్నాయా.. పాడైపోయాయా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

నిపుణులు చేపలను గుర్తించడంలో ఇదే ఉత్తమమైన మార్గమని అంటున్నారు. వాసన చూసే సందర్బంలో మీకు దానిలో నుంచి సముద్రపు నీరు వాసన వచ్చినట్లయితే అవి తాజా చేపలని అర్ధం. అలా కాకుండా దుర్వాసన వచ్చినట్లయితే.. అవి కచ్చితంగా పాడైపోయిన చేపలు. చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా.. అలాంటి చేపలు పాడైపోయినవి అని అర్థం. తాజా చేపలకు ఎప్పుడూ కూడా కళ్లు ప్రకాశవంతంగా, అలాగే ఉబ్బినట్లుగా ఉంటాయి. ఇలాంటివి గమనించి చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా మరో చిట్కాలో.. తాజాగా ఉంటే చేపల ఆకృతి లోపల, భయట ఒకేలా గట్టిగా ఉంటుంది.

అలా కాకుండా చేపల చర్మంపై ఏదైనా క్రస్ట్ ఉంటే పాడైపోయాయని అర్థం. అంటే ప్రాణం లేకుండా చాలా రోజుల నుంచి నిల్వ ఉంచారని గమనించాలి. తాజా చేపల మాంసం వాటని కోసిన తర్వాత శుభ్రంగా కనిపిస్తుంది. చేపల కళ్లను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వాటి కళ్లలో తెల్లటి పూతలు లేకుండా ఉంటాయి. అలాంటి చేపలు తాజావి అని అర్థం. అంతే కాకుండా తాజా చేపల రంగు సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. వాటి ఆకృతి కూడా కొద్దిగా తడిగా ఉంటుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలను పాటించి తాజా చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!