కేంద్రం ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన కార్మిక శాఖ నుంచి వెలువడింది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెన్షన్ పెంపు గురించి ప్రకటన వెలువడవచ్చని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం పెన్షన్ ను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం పీఎఫ్ సబ్స్క్రైబర్లకు కనీస పెన్షన్ 1000 రూపాయలుగా ఉండగా 2,000 రూపాయలకు పెన్షన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయని.. అయితే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే కేంద్రంపై 2,000 కోట్ల రూపాయల నుంచి 2,500 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా భారం పడనుందని తెలుస్తోంది.
అయితే కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడక ముందే కొంతమంది పీఎఫ్ సబ్ స్క్రైబర్లు మాత్రం 3,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి కనీస పెన్షన్ ను పెంచాలని కోరుతున్నారు. దేశంలో 60 లక్షల కంటే ఎక్కువమంది ప్రస్తుతం పెన్షన్ ను పొందుతున్నారు. ఉద్యోగి 58 సంవత్సరాలు పూర్తైన తరువాత పెన్షన్ ను తీసుకోవడానికి అర్హులవుతారు.
ప్రతి నెలా ఉద్యోగుల వేతనంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో కంపెనీ కూడా ఇంతే మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది. ఉద్యోగి కంట్రిబ్యూషన్ లో 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్ లో జమవుతుంది. మరి కేంద్రం పెన్షన్ పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


































