Gowri Pandit: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేశం నలువైపుల నుండి ప్రతి ఏటా ఎంతోమంది హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వరుస విజయాలతో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో కొనసాగుతుంటే.. మరి కొంతమంది సరైన హిట్లు లేక ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.

ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం హిట్ అందుకున్న కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అలా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో గౌరీ పండిట్ కూడా ఒకరు.
గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాలో గౌరీ పండిట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో హీరోయిన్ గా గౌరీ పండిట్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ
సినిమా తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలలో నటించింది. ఇక 2012లో విడుదలైన హౌస్ ఫుల్ సినిమా తర్వాత గౌరీ పండిట్ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక వివాహం తర్వాత వెంటనే బాబు పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైన గౌరీ పండిట్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

Gowri Pandit:కుటుంబంతో హ్యాపీగా ఉన్న గౌరీ పండిట్..
తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గౌరీ పండిట్ తన కొడుకుతో తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటికి ఇప్పటికీ గౌరీ పండిట్ ని పోల్చుకోవటం కష్టంగా మారింది. ఎందుకంటే అప్పటి కన్నా ఇప్పుడు మరింత అందంగా ఉంది. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తే సెకండ్ హీరోయిన్ గా కూడా చాన్స్ అందుకోవడం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు.

































