Connect with us

Featured

Gummadi : ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

Published

on

Gummadi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు. కెరీర్ ప్రారంభంలో విలన్, స్నేహితుడు, సహయాక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి, తాత పాత్రలకు ఆయనే బెస్ట్ ఛాయిస్ అని దర్శక, నిర్మాతలు భావించారు. అలా ఆయన 500 చిత్రాలలో చక్కటి పాత్రలు పోషించారు.  పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో గుమ్మడికి అవకాశాలు దక్కాయి.

Gummadi :ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

గుమ్మడి వెంకటేశ్వరరావు అసలు పేరైనప్పటికి ఇంటిపేరుతోనే ఆయన క్రేజీ స్టార్‌గా మారారు. నటుడవ్వాలని ఆసక్తి ఉన్నా కూడా ఆయన సినిమా రంగ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. అవకాశాల కోసం ఎదురు చూడని సమయంలో నటించే  అవకాశం దక్కింది. లక్షమ్మ, శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు, అలనాటి కథానాయిక కృష్ణవేణి నిర్మాత. ఇక శ్రీలక్షమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శక నిర్మాత కాగా, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి జంటగా నటించారు. అందులో ఒక పాత్రకు గుమ్మడికి అవకాశం ఇవ్వమని సిఫారసు చేసారు. సరేనన్నప్పటికీ అవకాశం మాత్రం ఇవ్వలేదు.

Gummadi :ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

Gummadi : గుమ్మడికి మాట ఇచ్చిన ఎన్టీ రామారావు :

అయితే గుమ్మడి ప్రయత్నాలు మాత్రం మానలేదు. తెలిసిన వారి ద్వారానే మద్రాసు చేరుకున్నారు. ఈ క్రమంలో అదృష్టదీపుడు అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం అందుకున్నారు. ఈ సినిమా 1950 లో వచ్చింది. అయితే గుమ్మడి కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగలేదు. చేసిన సినిమాలలో చిన చిన్న పాత్రలు కావడం..దాంతో అంతగా గుర్తింపు దక్కకపోయేసరికి నాకు ఇండస్ట్రీ సరిపడదని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఎన్.టి. రామారావు.. మీరు ఎక్కడికీ వెళ్ళొద్దని.. నా తరువాత సినిమాలో మంచి వేషం ఇస్తానని మాటిచ్చారు.  

Gummadi :ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

ఎన్.టి.రామారావు ఇచ్చిన మాట ప్రకారమే గుమ్మడికి ఆయన నటించిన పిచ్చిపుల్లయ్య సినిమాలో విలన్ పాత్ర ఇచ్చారు. ఈ పాత్రతో గుమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ కూడా ఎన్.టి.రామారావు నటించిన తరువాతి చిత్రం తోడుదొంగలు లోనూ ప్రధాన పాత్ర అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

Gummadi :ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

అలా గుమ్మడి కెరీర్ సక్సెస్ కావడానికి ఎన్.టి. రామారావు ప్రధాన కారణమయ్యారు. వాస్తవంగా రామారావు, నాగేశ్వరరావుల కంటే గుమ్మడి వయసులో చిన్నవాడు. అయినా చాలా చిత్రాలలో వీరిద్దరికి తండ్రిగా, మామగా నటించడం విశేషం. వశిష్ట, విశ్వామిత్ర పాత్రలతో గుమ్మడికి గొప్ప పేరు వచ్చింది. దశరథునిగా, భీష్మునిగా,ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, వంటి పౌరాణిక పాత్రలు ఆయన కోసమే తయారయ్యాయా అని చెప్పుకున్నారు. ఇక కమర్షియల్ సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!