Prashanth Varma: ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటి నుంచి సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఏమాత్రం థియేటర్లను కేటాయించలేదు. అదేవిధంగా సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అంటూ నిర్మాతల పై ఒత్తిడి కూడా వచ్చిందని తెలుస్తుంది. అయితే వాటన్నింటిని అధిగమించి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమా పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి ఈ సినిమాపై చెడు ప్రచారం మొదలు పెడుతున్నాయి. ఇలా ఈ సినిమా గురించి చెడు ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమాన్ టీమ్ పై దాడి..
ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా సినిమా పట్ల జరుగుతున్నటువంటి చెడు ప్రచారంపై స్పందిస్తూ.. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొందరు హనుమాన్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఈ చెత్తను భోగి మాటల్లో కాల్చేయాలని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.































