సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం 3.25 నిమిషాలకు కృష్ణం రాజు మృతి చెందారు.

కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83సం. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. అయన మృతిపై సినీ ఇండస్ట్రీలో విశాదచాయలు అలుముకున్నాయి. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొంతకాలం వరకు యాక్టివ్ గా కనిపించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాత్తుగా మరణించడంపై తెలుగు ప్రజలు దిగ్బ్రాంతి చెందుతున్నారు. ఇటీవల రాధేశ్యాం ప్రమోషన్లలో మరియు ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో కూడా అయన పాల్గొన్నారు. అయితే శ్వాశకోశ సమస్యలతో ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపధ్యంలో ఈ సమస్య ఎక్కువ అవడంతో నిన్న హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చేరారు. ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
































