బిగ్ బాస్ సీజన్ 5 లో నాగార్జున సందడి మొదలైంది. ఈ రోజు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోలో మొత్తం ఏడుపులే కనిపిస్తున్నాయి. సరయు, సిరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. నాగార్జున అక్కడ నుంచి మాట్లాడుతున్నా ఎవరికి వారు తిట్ల పురాణం మొదలుపెట్టుకొని వాళ్ల పని వాళ్లు కానిచ్చేశారు. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో ఏముందంటే.. మొదట వాళ్లకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు నాగార్జున.

అదేంటంటే.. ‘ఎవరితో సెట్టు.. ఎవరితో కట్టు’ అనేది ఇచ్చారు. మొదట శ్వేత అనీ మాస్టర్ ను చూస్తే.. చనిపోయిన మా అమ్మ గుర్తకు వచ్చిందంటూ.. అనీ మాస్టర్ తో సెట్టు అంటూ.. శ్వేత భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత సింగర్ శ్రీరామ్ శ్వేతతో సెట్ అని.. కాజల్ కట్ అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత సరయు విషయానికి వస్తే.. సిరిపై తీవ్రంగా విరుచుకుపడింది.
ఆటలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆడాలి.. ఎవరు కోపరేషన్ లేకపోయినా ఆడటం అనేది కష్టం అంటూ సిరితో కట్ అని చెబుతుంది. తనకు ఎవరి సహకారం లేదు కాబట్టి కెప్టెన్ కాలేకపోయానని.. మీరు ఎవరి సహకారం లేకుండా ఆడి చూపించు అంటూ సిరితో కోపంగా అంటుంది సరయు. తనను గెలిపించమని ఏ రోజైనా చెప్పానా నేను అంటూ సిరి తీవ్రంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కూడా.
అది చూసిన నాగార్జున ఇది కెప్టెన్సీ టాస్క్ కాదు.. దీని వెనుక ఏదో జరిగిందంటూ ఆరా తీస్తారు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. దీంతో నాగార్జును కొద్దిసేపు షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.






























