తెలుగు బుల్లితెరపై “బిగ్ బాస్” రియాలిటీ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదో సీజన్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్ నెలలో నిర్వహించాలని షో నిర్వాహకులు భావించినా కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. దీంతో ఈ షోను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించాలని షో నిర్వాహకులు భావించారు అయితే నాగార్జున ప్రస్తుతం బంగారు రాజు వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ఈసారి బిగ్ బాస్ ఐదో సీజన్కు హోస్ట్గా ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అలాగే ఐదో సీజన్కు హోస్ట్గా నేషనల్ స్టార్ రానా ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
ఈసారి బిగ్ బాస్ షోను రానా తనదైన శైలిలో నడిపించి ఏ మేరకు కంటెస్టెంట్లతో ఆడుకుంటారన్నది చూడాలి. అలాగే బిగ్ బాస్ ఐదో సీజన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలే కాకుండా, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ షో కు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది వీరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్,యాంకర్ శివ, హైపర్ ఆది, టిక్టాక్ స్టార్ దుర్గారావు వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు సీజన్ ఫైవ్ లోకి అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.































