Hero Suman : సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే ఒక్క బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే చాలదు. స్వశక్తితో ముందుకు ఎదగాలి. అయితే పైకి ఎదుగుతున్న ప్రతిసారి కింద పడవేయడానికి చాలా మంది రెడీ గా ఉంటారు. అయితే జయాపజయాలు తట్టుకుని నిలబడడం అంటే సర్వ సాధారణ విషయం కాదు. అయితే ఒకప్పుడు ఎంతో క్రెజ్ ఉన్న హీరో ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోయి, మళ్ళీ పైకి ఎదగడం అంటే మాటలు కాదు. అలాంటి కోవకు చెందిన హీరోనే సుమన్. ఆరడుగుల అందగాడుగా టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు ఉంది. తన అందంతో, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి, అందరిని మెప్పించి అమ్మాయిల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్ అని అనడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి సుమన్ అసలు పేరు తెలియదు. అందరికి సుమన్ గానే పరిచయం. కానీ, అయన అసలు పేరు సుమన్ తల్వార్. స్వతహాగా సుమన్ మాతృబాష తెలుగు కాకపోయినా గాని ఎంతో స్పష్టంగా, అచ్చమైన తెలుగులో మాట్లాడేవాడు. అందుకేనేమో తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు.
సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం కష్టపడే సమయంలో హీరో బాను చందర్ తో మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీనితో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరికి మార్షల్ ఆర్ట్స్ పై పట్టు కూడా ఉంది. అయితే మొదట సినిమాల్లో నటించే అవకాశం బానుచందర్ కి వచ్చింది. తరువాత సుమన్ ను సినిమాల్లో రికమండ్ చేయడం జరిగింది. అప్పటినుండి వీళ్ళు ఇద్దరు అనేక సినిమాల్లో నటించారు. అలాగే వీరు నటించిన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ను విస్తృతంగా ఉపయోగించారు. ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికి తెలిసేలా చేసారు. ఆ తరువాత తరంగిణి సినిమాతో పాటు, యువతను ఉద్దేశించిన నేటి బాలలు, దేశంలో దొంగలు పడ్డారు వంటి చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పోటాపోటీగా సుమన్ సినిమాలు ఆడేవి. ఇలా మంచి ఉత్సహంతో ముందుకెళుతున్న సుమన్ కి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది.
నీలిచిత్రాల కేసులో సుమన్ పేరు తెరమీదకు రావడంతో అయన జైలుకి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో బెయిల్ కూడా దొరకక కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అలాగే సినీ పరిశ్రమ కూడా షాక్ కు గురయింది. అలాగే సుమన్ కూడా బాగా కృంగిపోయాడు. జైలు నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు రాక, పరువు, ప్రతిష్ట మంటకలిసిపోవడంతో తేరుకోలేని డిప్రెషన్ లో పడిపోయాడు. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో మళ్ళీ అదృష్టం తలుపుతట్టింది.
గుండమ్మ కధ, బడి పంతులు, రాముడు భీముడు, యమగోల, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ చిత్రాలు రచించిన ప్రముఖ రచయిత డివి నరసరాజు తన మనుమరాలను హీరో సుమన్ కి ఇచ్చి పెళ్లి చేసాడు. అయితే ప్రముఖ రచయత, సుమన్ ను పిలిచి మరి మనవరాలిని ఇవ్వడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురి అయింది. అప్పుడే అందరిలో ఆలోచన మొదలయింది. సుమన్ చెడ్డవాడు అయితే రాజుగారు పిలిచి మరి పిల్లను ఎందుకు ఇస్తాడు అనే అనుమానం మొదలయింది అందరిలో. పెళ్లి తరువాత సుమన్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మళ్ళీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఆ తరువాత అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో సుమన్ పాత్ర అమోఘం. ఈ సినిమా వల్లే సుమన్ కి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఆ తరువాత శ్రీరాముడు సినిమాలో రాముని పాత్ర దొరకడం సుమన్ కి మంచి ప్లస్ అయింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి, తనలోని మరొక యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు చూపించాడు. ఇలా సుమన్ కెరీర్ మలువు తిరిగి విజయానికి చేరువలో నడవడానికి కారణం అయన సతీమణి శిరీష. పెళ్లి అనే బంధం సుమన్ జీవితాన్ని మార్చేసింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు “అఖిలాజా ప్రత్యూష”. తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఎటువంటి అబ్యంతరం లేదని సుమన్ తేలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు సుమన్.
Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీ రిలీజ్..
Advertisement
దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు.
Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
Advertisement
బోయపాటి పైనే భారం.. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.
Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Advertisement
పాజిటివిటీని పెంచాలి.. చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.