అక్కినేని వారసత్వం నుంచి రెండో తరం నటుడిగా వచ్చిన సుమంత్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతాడనుకున్న కానీ పెద్ద హిట్లు రాకపోవడం.. వరస ఫ్లాపులతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు అటు వ్యక్తిగత జీవితం కూడా కాస్త ఒడిదొడుకలతోనే సాగిందని చెప్పొవచ్చు.

తాజాగా కన్నడలో హిట్ అయిన కపటధారిని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేసినా విజయం కాలేకపోయాడు. అయితే ఈ హీరో సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన.. వివాదాల్లో మాత్రం ఉంటున్నాడు. తాజాగా ఓ చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ తో పాటు సుప్రియల ఇరుక్కున్నారు.
గురువారం ఈ కేసు విషయమై మార్కాపురం కోర్ట్ కు హాజరయ్యారు. నరుడా.. ఓ నరుడా సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన శ్రీనివాస్ రావు కోర్ట్ లో కేసు వేశాడు. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కారుమంచి శ్రీనివాస్ రావు కోర్టలో కేసు వేశారు. నరుడా..ఓ నరుడా సినిమాలో సుమంత్ హీరోగా, నిర్మాతగా సుప్రియ ఉన్నారు.
ఈ సినిమాకు కారుమంచి శ్రీనివాస్ రావు ఫైనాన్స్ అందించారు. తనకు డబ్బు ఇచ్చే విషయంలో చెక్ బౌన్స్ అయిందని.. తనను మోసం చేశారని శ్రీనివాస్ రావు కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.































