Heroine Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మొదట సొంత భాషలో ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఛలో సినిమాతో పరిచయమయ్యింది. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పైగా తొలిచూపులతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో కూడా మరింత బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆ సమయంలో అందరి మదిలో నేషనల్ క్రష్ గా కూడా నిలిచింది. మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది. పైగా పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
పుష్ప సినిమాతో ఈ అమ్మడు అస్సలు ఆగటం లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఐదేళ్లలో ఈ బ్యూటీ ఎంత సంపాదించిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Heroine Rashmika
ఇప్పటివరకు ఆమె ఐదు లక్షలు అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని తెలిసింది. హైదరాబాద్ లోనే కాకుండా గోవా, కూర్గ్, ముంబై, బెంగళూరు లో రూ.100కోట్ల పైన విలువ చేసే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని తెలిసింది. అయితే ఇదంతా ఒక మీమ్ గా వైరల్ అవ్వగా.. వెంటనే రష్మిక దానికి స్పందించింది. ఇదంతా నిజమైతే బాగుండు అని ఆమె సమాధానం ఇవ్వడంతో.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలిసింది. కానీ కొందరు మాత్రం నిజంగానే ఆస్తులు ఉన్నాయేమో అని అనుమానం పెడుతున్నారు.































