హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి పదవి నుండి తొలగింపు.. దీంతో శాసనసభకు రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రముఖంగా తెరాస,బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రితిలో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.

అయితే ఉప ఎన్నిక ఎప్పుడూ అనేదానిపై ఇప్పటికి వరకు క్లారీటి రావడం లేదు. బద్వేల్ ఉపఎన్నికను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రథామిక నిబంధన ప్రకారం బద్వేల్లో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావాలి. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆక్టోంబర్లో హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.

































