Akhanda: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లను అనుసరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు సమాజానికి ఉపయోగపడే వాటి గురించి అవగాహన కల్పించడం వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని భావిస్తుంటారు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచిన అఖండ సినిమా ఒకవైపు థియేట్రికల్ రన్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో అఖండ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కారులో ప్రయాణిస్తూ సీట్ బెల్ట్ ధరించి ఉంటారు. ఈ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఎల్లప్పుడు సీట్ బెల్ట్ ధరించండి..
ఈ ఫోటోలో హీరో హీరోయిన్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో..కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి ఎంత దూరమైనా ఎవరికి ఏమైనా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా బాలకృష్ణ అఖండ సినిమా ద్వారా ఎంతో మంచి విషయాన్ని తెలియజేయడంతో ట్రాఫిక్ పోలీసులు అఖండ చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.































