హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్ స్టేజిపై ఉన్న తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరిపై పంచ్ డైలాగులు వేస్తూ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హైపర్ ఆది ఈసారి బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

బిగ్ బాస్ వేదికపైకి పోలీస్ ఆఫీసర్ పాత్రలో హౌస్ సభ్యుల గురించి ఇన్వెస్టిగేట్ చేశానని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి హైపర్ ఆది తనదైన శైలిలో పంచులు వేశాడు.ఇలా బిగ్ బాస్ వేదికపై అడుగు పెట్టిన ఆది నాగార్జునతో సహా ప్రతి ఒక్కరిపై పంచు డైలాగులు వేస్తూ అందరిని నవ్వించాడు. ఇలా అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి నిర్వాహకులు పెద్ద మొత్తంలోనే పారితోషికం చెల్లించి ఉంటారని సమాచారం వినబడుతుంది.
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ఆదితో ఒప్పందం కుదుర్చుకుని బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఫాలో కావలసిందిగా చెప్పారు.ఇలా తనను బిగ్ బాస్ ఫాలో కమ్మని అతనితో కమిట్మెంట్ తీసుకొని తనని ఈ షోకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ని హైపర్ ఆదికి అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసినందుకుగాను అతనికి బిగ్ బాస్ నిర్వాహకులు ఏకంగా 1.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే హైపర్ ఆది మరోసారి కూడా బిగ్ బాస్ వేదికపైకి రానున్నట్లు తెలుస్తోంది.19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్ లు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.






























