మన దేశంలో కరోనా సెంకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోజువారీ కేసుల ప్రళయం 3 లక్షలకు చేరువైంది. గత వారం రోజులుగా రోజుకు 2 లక్షల కేసులు దాటాయి. ఈ నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో మన దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 2,95,041 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒక్కరోజులో కరోనాతో 2,023 మంది మరణించారు. ఇక రాష్ట్రాలలో మహారాష్ట్ర అత్యధికంగా 62,097 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక మొత్తం మృతుల సంఖ్య 1,82,570కి చేరింది. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. దేశంలో ఇప్పటి వరకు 21లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.































