Connect with us

Featured

ఎస్పీ బాలు ఏ సినిమా లోని పాట పాడలేనని భయపడి పరుగులు తీశారో మీకు తెలుసా.?!

Published

on

ఈ గాన గంధర్వుడు లేకపోతే భారత సినీ పరిశ్రమలేదు అన్నంతగా ఆయన పాటలు భారతీయ సినీ ప్రేక్షకుల మీద ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు 15 భాషల్లో తన గొంతుతో అనేక పాటలు పాడి శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు. నాలుగు భాషల్లో పాడినందుకు జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్న ఏకైక గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా శాస్త్రీయ సంగీత రసజ్ఞులను మెప్పించిన మహా గాయకుడు. సినీ రంగంలో నెంబర్ వన్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. నెంబర్ వన్ ఏమిటి 1 నుంచి 10 వరకు అన్ని స్థానాల్లో ఎస్పీ బాలునే ఉంటారు. బహుముఖ గాయకుడు ఒక్క ఎస్పీ బాలు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే సంగీత దర్శకుడు,నటుడు,నిర్మాత,డబ్బింగ్ ఆర్టిస్ట్ ,కొత్త గాయకులను వెలికితీసే పాడుతా తీయగా హోస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా సినీ కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు.

ఒక సందర్భంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సరాగ హృదయుడు, సరస హృదయుడు, సహృదయుడు స్థితప్రజ్ఞుడు, అద్వితీయుడు అని ఆ మహానుభావుడు కొనియాడడం వెనుక ఎస్పీ.బాలు గానగంధర్వ పటిమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మరో సందర్భంలో వేటూరి పాటలకు ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడే సంగీత సాగరం.. అని సంబోధించారు.

నటి గాయని భానుమతి నెల్లూరులో లలిత కళ సమితికి అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉండేది. అదే లలిత కళా సమితి లో ఎస్పీ బాలు పాటలు పాడుతూ ఉండేవారు. ఒకసారి నెల్లూరులో సభకు భానుమతి హాజరు కావవడం జరిగింది. అప్పుడు బాణమతి పరిచయమయ్యారు. అలా మద్రాసులో సాలూరి రాజేశ్వరరావు భానుమతి లను ఒకే చోట ఎస్.పి.బాలు కలిశారు. ఆయన పాట విన్న ఆ ఇద్దరు చూద్దాం అని చెప్పారు.

అలా అవకాశాలు రాక రెండే జతల బట్టలతో సైకిల్ మీద తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాడు. ఎస్పీ బాలు ను చూసిన కోదండపాణి ఎవరో ఎందుకు తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకుంటానని ఎస్పీ. బాలు ని తన దగ్గర ని చేర్చుకున్నాడు. పాటలు పాడడమా.. చదువు కొనసాగించడమా.. అనే సందిగ్ధంలో ఉన్న బాలసుబ్రమణ్యంకి ఇలా అవకాశం వచ్చింది.
పద్మనాభం నిర్మాతగా 1966లో శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాకి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆ సినిమాలో పీబి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్య, సుశీలతో పాటుగా 4వ చరణం పాడడానికి అవకాశం వచ్చింది. ఆ పాట రికార్డింగ్ 1966 డిసెంబర్ 15న 12 గంటలకు..కానీ సినిమా పాట పాడడానికి స్టూడియోకి వెళితే ఎస్పీ. బాలును ఎవరో అనుకోని వాచ్ మెన్ లోపలికి రానివ్వలేదు.ఎలాగో లోపలికి వెళ్లి ఆ సినిమాలోని ఒక పాట నాలుగో చరణాన్ని ఎస్పీ బాలు చాలా మధురంగా ఆలపించారు.

అలా అలవోకగా ఆయా నటులకు గొంతులకు సరిపోయే విధంగా పాటలు పాడుతూ 1980 సంవత్సరం వచ్చేసరికి సిరిసిరిమువ్వ తర్వాత మరో సంగీతపరమైన చిత్రం శంకరాభరణం తీయడానికి కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ సినిమాకి కె.వి.మహదేవన్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. శాస్త్రీయ సంగీతం ఆధారంగా కొనసాగే సినిమాలో శంకరా నాదశరీరాపరా వేద విహారా హరా..జీవేశ్వరా.. అనే పాట పాడడానికి కె.వి మహదేవన్ బాలుచే పాడించాలనుకున్నారు.

అప్పుడు ఎస్పీ బాలు శాస్త్రీయ సంగీతమా అంటూ భయపడి పరుగులు తీశారు.అలా పరుగులు తీసిన ఎస్పీ బాలును కె.వి.మహదేవన్ అసిస్టెంట్ పుగలేంది తీసుకువచ్చి బాలుచే శంకరా నాదశరీరాపరా.. అనే పాట పాడించడం జరిగింది. ఇప్పటికీ ఒళ్ళు జలదరించే ఆ అద్భుతమైన పాట ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pitapuram: ఒక్క పిఠాపురంలోని 500 కోట్ల బెట్టింగ్.. ఉత్కంఠత రేపుతున్న ఎన్నికల ఫలితాలు!

Published

on

Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Laya: అమెరికాలో అడుక్కు తింటున్నా.. రోల్స్ పై ఎమోషనల్ అయిన లయ?

Published

on

Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

రోడ్డుపై పడ్డాను..
తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పార్టీ గెలిస్తే పవన్ ఎనర్జీ లెవెల్ కు ఆ పదవే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హోం శాఖ మంత్రి..
ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!