Connect with us

Featured

తండ్రి చేసిన పనులతో హీరో ప్రశాంత్ కెరీర్ ఎలా నాశనం అయ్యిందో తెలుసా..?

Published

on

1990 లోతమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోల్లో ప్రశాంత్ ఒకడు. అరడుగుల ఆజానుభావుడు మాత్రమే కాదు, మంచి రొమాంటిక్ హీరో కూడా. తెలుగు, మలయాలం, కన్నడ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. నటి రోజా భర్త సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన చామంతి సినిమాలో రోజా, ప్రశాంత్ ఇద్దరు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఉండడం విశేషం. ఆ తరువాత క్రియేటివ్ దర్శకుడు మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలో కూడా ప్రశాంత్ నే హీరో. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మాటల్లో చెప్పలేము. ఈ సినిమాలో హీరో పాత్ర అమోఘం. ఎందుకంటే ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

ఆ తరువాత తొలి ముద్దు సినిమాలో దివ్య భారతి సరసన హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం దివ్య భారతి మరణానికి ముందే నటించిన చిత్రంగా రికార్డు సంపాదించుకుంది. అయితే దివ్యభారతి చనిపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో దివ్యభారతి పోలికలు ఉన్న రంభను డూప్ గా పెట్టుకుని సినిమా పూర్తి చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రశాంత్ 17 ఏళ్ల వయసులో కోర మీసాలతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ అందాన్ని చూసి అందరు నివ్వెరపోయేవారట. ఇంకా తెలుగులో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి లాఠీ, ప్రేమ శిఖరం, సాహసం సినిమాల్లో నటించాడు. ఇంకా హిందీలో అనుఖా, ప్రేమయుద్, ఐ లవ్ యు సినిమాల్లో కూడా నటించాడు. అలాగే ఇంకా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. కెరీర్ మంచిగా ముందుగా సాగె సమయంలో ఉన్నటుండి పూర్తిగా కిందకు జారిపోయాడు. అలాగే ప్రశాంత్ వాస్తవానికి హీరో విక్రమ్ కి కజిన్ అవుతాడు. అయితే అప్పట్లో ఈ హీరో చిత్రసీమలో ఒక వెలుగు వెలుగుతూ ఉండాలిసింది కానీ అలా జరగలేదు. హీరో సిద్దార్ధ, మాధవన్ స్థాయిలో అయిన ఉండేవాడని కోలీవుడ్ వర్గాలు అప్పట్లో అనేవారు.

2000 దశకంలో ప్రశాంత్ కథానాయకుడిగా చాలా సినిమాలు ప్రారంభమయ్యాయి కానీ వాటిలో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. అలానే ప్రశాంత్ సినీ జీవితం మధ్యలో ఆగిపోవడానికి, ఉన్నట్టుండి కెరీర్ దెబ్బతినడానికి అయన తండ్రి త్యాగరాజన్ కారణం అని పలు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ప్రశాంత్ కి చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఏ దర్శక నిర్మాత డైరక్ట్ గా ప్రశాంత్ ను కలవలేకపోయేవారు. ఎందుకంటే ప్రశాంత్ కి సంబంధించిన అన్ని విషయాలు తన తండ్రి త్యాగరాజన్ చూసుకునేవాడు. అలాగే ఏదన్న సినిమా హిట్ అవ్వడంతో ఉన్నటుండి ప్రశాంత్ రెమ్యూనిరేషన్ పెంచేసేవాడు. దీనితో ప్రశాంత్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనకాడేవారు. తరువాత ఒక కోటీశ్వరురాలతో ప్రశాంత్ పెళ్లి జరిగింది.

కానీ ప్రశాంత్ పెళ్లి అయిన కూడా తండ్రి చాటు బిడ్డలాగానే అయన చెప్పుచేతల్లోనే ఉండేవాడు. దీనితో విసిగిపోయిన ప్రశాంత్ భార్య ఒకానొక సందర్బంలో నీకు తండ్రి కావాలా.. భార్య కావాలా అని అడగడంతో చాలారోజులు షాక్ లో ఉండిపోయాడట. ఫైనల్ గా తండ్రి నిర్ణమయానుసారం భార్య కి విడాకులు ఇచ్చేసాడు. తన సినీ జీవితంలో గాని, నిజ జీవితంలో గాని ప్రశాంత్ తండ్రి తీసుకున్న నిర్ణయాలు ఆయన్ని పాతాళంలోకి తొక్కేశాయి. ఎన్నో సంవత్సరాల సుస్థిర విరామం తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు . రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. అయితే అప్పటి జీన్స్ చిత్రంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రశాంత్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా నటించిన ప్రశాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. సరైన విజయాలు దక్కకపోవడం వలనే ప్రశాంత్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!