బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో వంటలక్క సవతితల్లి పాత్రలో పోషిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి చేసే కామెడీ అందరి చేత నవ్వులు పూయిస్తుంది. కార్తీకదీపం సీరియల్ బోర్ కొడుతునప్పుడు భాగ్యం పాత్ర ఎంటర్ అయితే చాలు అందరి మొహాల్లో నవ్వులు పూస్తాయి.

ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన ఉమాదేవి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లో ఎంతో బిజీగా ఉండటంవల్ల సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు. ఎంతో మంది స్టార్ కమెడియన్ సరసన నటించిన ఉమాదేవి బోల్డ్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు.అయితే తాను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్ళు పూర్తికావడంతో ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఉమా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం తన కల అని ఆమె తెలిపారు. అటు బుల్లితెర లోను, వెండితెరలోను నటించిన ఈమె దేనిలో నటించడం కష్టమని అడిగితే.. మనకి ఇష్టమైన పని చేయడం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఇష్టంగా చేస్తే ఏది కష్టమనిపించదు అంటూ నటన పై తనకున్న ఇష్టాన్ని తెలియజేశారు.
ఇన్ని సంవత్సరాల తన కెరియర్లో ఎప్పుడూ కూడా ఇబ్బంది పడింది లేదని, ఇన్నేళ్లు తాను చేసిన పాత్రలో ఇది చేయకపోయి ఉంటే బాగుండేది అనే పాత్రలు ఒక్కటి కూడా లేదని ఆమె తెలిపారు. ఏదైనా మనం ఒక ప్రొఫెషనల్ అనుకున్నప్పుడు అది ఇష్టంగానే నటించాలి. కష్టం అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చోవడం ఎంతో ఉత్తమం అంటూ తెలిపారు.కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా అది ఏ ఇండస్ట్రీలో అయినా ఇష్టంతో చేస్తే అందులో ఉన్న కష్టం విలువ మనకు తెలియదు అంటూ ఉమా తెలిపారు. ఇన్ని సంవత్సరాల తన కెరియర్లో ఎప్పుడూ ఎవరి వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదని, ఇప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉండటంవల్ల తన కెరీర్ ని ఇలా కొనసాగిస్తున్నానని ఆమె తెలిపారు.































