బాలీవుడ్ ప్రేమ జంట కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఇప్పటికే 400 మంది అతిథులకు ఆహ్వానాలు అందాయని సమాచారం. ఇక వీరి పెళ్లికి రాజస్థాన్లోని సిక్స్సెన్సెస్ ఫోర్టు ముస్తాబయింది. ఇక వీరి పెళ్ళికి వెళ్లే అతిథులకు ఈ జంట ఒక నిబంధన పెట్టినట్లు సమాచారం.

వీరి పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో వీడియో కూడా బయటకు రాకూడదని ముందుగా అతిథులకు నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వారి పెళ్ళికి ఇలాంటి నిబంధనలు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో బయటకు వెళ్లకూడదని కత్రినా – విక్కీలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పెళ్లికి సంబంధించిన సమస్త ఫుటేజీని ఒక ప్రముఖ ఓటీటీ సమస్థ ఏకంగా కోటి రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్థ వీరి పెళ్లిని లైవ్లో చూపించడం కోసం 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ వివాహ వేడుకలలో కెమెరాలు ఫోటోలు నిషేధితమని ఈ జంట వెల్లడించారు.మామూలుగా అయితే సెలబ్రిటీల పెళ్లి వీడియోలు ఫోటోలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇలా వంద కోట్ల ఖర్చు చేసిన పెళ్లి మాత్రం కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం మాత్రమే అని చెప్పవచ్చు.





























