Connect with us

Featured

Katrina Kaif: మరొకసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్.. నెట్టింట వీడియో వైరల్?

Published

on

Katrina Kaif: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏఐ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఆ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించింది. ఆ విషయంపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు. అయితే ఆ విషయంపై సీరియస్ గా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక్క రష్మిక ఫొటోస్ మాత్రమే కాకుండా అలియా భట్, నోరా ఫతేహీ, సోనూ సూద్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు టాలీవుడ్ తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

అయితే తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు తెలియజేశారు. కానీ ఇప్పుడు మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది కత్రినా కైఫ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలోనిది. ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

కత్రినా డీప్ ఫేక్ వీడియో వైరల్..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. టవల్ ఫైట్ సన్నివేశంలోని స్టిల్స్ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ నుంచి తొలగించారు. మరి రోజురోజుకీ నేటిజన్స్ ఆకతాయిలా ఆగడాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. దీంతో చాలామంది ఈ విషయం పట్ల అధికారులు కాస్త సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C1J1UvqMBNh/?utm_source=ig_embed&ig_rid=ded71047-d429-4562-88dc-d3d2cd550188

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!