వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కీలక పదవి లభించింది. పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైసిపి విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవికి విజయసాయిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కావడం విశేషం. విజయ సాయిరెడ్డి తో పాటు సుధాంశు త్రివేది కూడా ఈ పదవికి ఎన్నికయ్యారు. త్రివేది భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులు

వీరిద్దరి ఎన్నికను రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో కీలక పాత్ర వహిస్తుంది.


































