అక్కినేని నాగచైతన్య సమంత దంపతులు పలు కారణాల వల్ల విడిపోతున్నామని వారి విడాకులు ప్రకటన చేసిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఆమెకు ఎవరితోనో అఫైర్స్ ఉన్నాయంటూ అందుకే విడాకులు ఇచ్చారు అంటూ ఆమె గురించి దుష్ప్రచారం చేశారు.

ఈ క్రమంలోనే సమంత గురించి వస్తున్న ఈ వార్తలపై స్పందించిన ఆమె యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లిలో కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే ఈ కేసుపై విచారణ నిన్న జరగగా కోర్టు తీర్పును మాత్రం వెల్లడించలేదు. కోర్టు సమయం ముగిసిపోవడంతో ఈ కేసులో తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కోర్టు సమయం ముగిసేలోపు ఈ పిటిషన్ పై తీర్పును వెల్లడిస్తామని కూకట్ పల్లి కోర్టు తెలియజేసింది.
ఈ క్రమంలోనే సమంత పర్సనల్ లాయర్ బాలాజీ మాట్లాడుతూ సమంత నాగ చైతన్య ఇంకా విడాకులు తీసుకుని విడిపోలేదని కేవలం తీసుకుంటున్నట్లు ప్రకటన మాత్రమే ఇచ్చారు.ఈ లోగా ఆమె గురించి ఈ విధమైనటువంటి అసత్య వార్తలు ప్రచారం చేయడం ఎంతో విడ్డూరమని ఆయన ఆరోపించారు.సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆమె గురించి లేనిపోని కథనాలు అన్నింటిని సృష్టించినట్లు బాలాజీ కోర్టుకు వివరించారు.
ఈ క్రమంలోనే తను పరువునష్టం దావా వేయడానికి బదులుగా క్షమాపణ కోరవచ్చు కదా అంటూ కోర్టు ప్రశ్నించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేది వాళ్లే, చివరికి వారి పరువు నష్టం దావా వేయడం ఏంటి అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మరి సమంత ఈ కేసు విషయంలో నేడు ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.































