Gayathri Dolly: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మరణించారు. కొందరు రోడ్డు ప్రమాదాల వల్ల, మరి కొందరు అనారోగ్యం కారణంగా ఇలా ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. గాయత్రి డాలి గా పేరు తెచ్చుకున్న అప్ కమింగ్ హీరోయిన్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించింది.

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రితో పాటు రోహిత్ కూడా గాయపడ్డారు. ఇక వెంటనే వారిని హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి, రోహిత్ ఇద్దరూ మరణించారు. అప్ కమింగ్ హీరోయిన్ అయిన నటి గాయత్రి డాలీ ని డి క్రూజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

అంతేకాకుండా గాయత్రి 2021లో LoL సలాం అనే ఒక మినీ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నటిగా మారాలి అన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి భవిష్యత్తును ఊహించుకున్న గాయత్రి మరణ ఈ వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఆత్మకు శాంతి కలగాలి…
అదేవిధంగా ఆమె అభిమానులు సినీ ఇండస్ట్రీ వారు ఆమె మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కెరీర్ పరంగా మంచి భవిష్యత్తును ఊహించుకున్న గాయత్రీ మరణం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.


























