Lyricist Chandrabose : పాటల రచయితగా సుమారు 400 సినిమాలకు 3300 పాటలు రాసిన గేయ రచయిత చంద్రబోస్ గారు నేడు మరో కీర్తి కిరీటాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ కు చెందిన చంద్రబోస్ గారు చిన్నతనంలోనే పద్యాలు, రచనల మీద మక్కువతో బిటెక్ చదివే సమయంలో కవితలు రాసేవారు. అలా స్నేహితుల సహాయంతో మొదటి సారి శ్రీకాంత్ నటించిన ‘తాజ్ మహల్’ సినిమాలో మంచు కొండల్లోన చంద్రమా పాట రాసాడు. అది సూపర్ హిట్ అవడంతో అవకాశాలు బాగా వచ్చాయి. ఇక అలా పాటల రచయితగా ఎన్నో హిట్స్ అందుకున్న చంద్రబోస్ గారికి తాను రాసిన పాటల్లో బాగా కదిలించిన పాట ఏదో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

ఆ పాట కంటతడి పెట్టించింది…
ఎన్నో వేల పాటలను రాసిన చంద్రబోస్ గారికి ఆయన రాసిన పాటల్లో కదిలించిన కంటతడి పెట్టించిన పాట ఏంటనే ప్రశ్నకు చంద్రబోస్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో వచ్చే ఈ చేతితోనే బువ్వ పెట్టాను సాంగ్ రాసినపుడు బాగా ఎమోషనల్ అయ్యాను అని చెప్పారు. ఆ సినిమా అపుడు దుబాయ్ లో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పాటలు ఎలా ఉండాలి అని చర్చిస్తున్న సమయంలో సన్నివేశం చెప్పగానే డైరెక్టర్ బయటికి వెళ్లి వచ్చేలోపు పాటను రాసేసాను.

వెంటనే దేవిశ్రీ ట్యూన్ చెప్పడం పాట పాడి వినిపించడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక నేను పాట పాడినపుడు ఆ సాంగ్ ని దేవిశ్రీ రికార్డు చేసి డైరెక్టర్ సుకుమార్ కు వినిపించగా ఆ పాటను ఫైనల్ చేసారు. రికార్డు చేసిన పాటను విన్నపుడు కంట్లో నీళ్లు తిరిగాయని తెలిపారు చంద్రబోస్. ఇక అదే రికార్డింగ్ ను భార్య సుచిత్రకు పంపగా తాను కంటతడి పెట్టుకుంది అంటూ అది సినిమా అని తెలిసినా అందులో కల్పిత పాత్రకు రాసిన పాట అయినా కూడా పాట ఎంతో సహజంగా ఉంది అందుకే ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు అంటూ చంద్రబోస్ తెలిపారు.































