బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముందుగా కాజల్ భర్త కూతురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా కాజల్ తన భర్తను అందరికీ పరిచయం చేసి అందరితో ఎంతో సరదాగా గడిపారు. అదేవిధంగా శ్రీ రామచంద్ర సిస్టర్, సిరి మదర్ కూడా హౌస్ లోకి వచ్చారు.

ఈ క్రమంలోనే సిరి వాళ్ళ అమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడి తన కూతురిని ఈ స్థాయికి తీసుకు వచ్చారో చెప్పి ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా అతను షణ్ముక్ తో కలిసి ఉంటున్న తీరు తనకు నచ్చలేదని మొహం మీద చెప్పేశారు. ఇకపోతే మానస్ తల్లి పద్మిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా హౌస్ లోకి వెళ్ళిన ఈమె హౌ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా గడిపారు. అదేవిధంగా ఇండైరెక్ట్ గా మానస్ ఆటకు ప్రియాంక అడ్డు పడుతుందని తనని దూరం పెట్టమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విధంగా హౌ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడిన మానస్ తల్లి తను ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని అలాగే ఆడమని తన కొడుకుకి సలహా ఇచ్చింది.
ఈ విధంగా మానస్ మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ వారం తనకి ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరి అందరూ అనుకున్న విధంగా మానస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలబెడతారా..లేదా తెలియాల్సి ఉంది. అలాగే హౌస్ లోకి సన్నీ మదర్, షణ్ముఖ్ మదర్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
































