Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

ఇలా ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఒక కారణం కాగా ఈ సినిమాపై నెగటివ్ టాక్ తో భారీగా వైరల్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని చెప్పాలి.
చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిపోయినటువంటి తల్లికి తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి.
తల్లిని నమ్ముకుంటే కష్టమే…
మహేష్ బాబుకి తల్లి సెంటిమెంట్ సినిమాలు పెద్దగా కలిసిరావనే విషయాలు గతంలో కూడా నిజమయ్యాయి. అయితే మరోసారి కూడా ఈయనకు తల్లి సెంటిమెంట్ అచ్చి రాలేదని తల్లిని నమ్ముకుంటే మహేష్ బాబుకి చేదు అనుభవమేనని గుంటూరు కారం నిరూపించింది. గతంలో కూడా మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో వచ్చినటువంటి సినిమాలలో నాని అలాగే నిజం సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.






























