మలేసియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోవడంతో తప్పనిపరిస్థితుల్లో రాజీనామా చేయాల్పి వచ్చింది. మలేసియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు.


కూటిమిలో వచ్చిన విభేదాల కారణంగా అధ్యక్ష పిటం నుంచి వైదొలగక తప్పలేదు. మరో ప్రభుత్వ ఏర్పాడే వరకు అతను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉపప్రధాని ఇస్మాయిల్, మాజీ మంత్రి, యువరాజు రజాలీ హమ్జా ప్రయత్నాలు కొనసాగుస్తున్న తెలుస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో మహతిర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా అనివార్య కారణాలతో ఆయన వైదొలగడంతో యాసిన్ 2020లో తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు.



































