మోహన్ బాబు వారసులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్, విష్ణులు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇందులో “మేజర్ చంద్రకాంత్” సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో బాలనటుడిగా నటించిన మంచు మనోజ్ “దొంగ దొంగది” సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తర్వాత బిందాస్, వేదం, కరెంట్ తీగ, పోటుగాడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకొని అభిమానులను ఇంకాస్త పెంచుకున్నారు.

ఇటీవల కాలంలో మనోజ్ పరిమితంగానే సనిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మి అనే సినిమా తెరకెక్కుతోంది. దీనిపై అతడి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. తాజాగా అతడు తన సోదరి మంచు లక్ష్మితో కలిసి తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో వెంచర్స్ లను ప్రారంభించనున్నామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా మనోజ్ అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే అతడు సినిమాల్లో నటిస్తారా.. లేదా వ్యాపారాలకే పూర్తిగా పరిమితమవుతారా.. అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
Wrong news spread Cheyadhuu annoooo ???????????????? summer nundi mana cinema startuuu ????????❤️ Action ani chepaka mundhe cut cheppadhu anna… anyways loveee you anna next article pls bless me and my hardworking team ????????❤️???? https://t.co/C63yo5xkse pic.twitter.com/3Tr2X7YTq2
— Manoj Manchu????????❤️ (@HeroManoj1) August 21, 2021
అయితే ఈ వార్తలకు మంచు మనోజ్ చెక్ పెడుతూ.. ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు.. తన గురించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దని.. ఆ న్యూస్ ను ఖండిస్తున్నట్లు ట్విట్టర్ లో ఆ న్యూస్ ను ట్యాగ్ చేస్తూ స్పందించారు. ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు బిజినెస్ లు స్టార్ట్ చేసిన వారు ఎందరో ఉన్నారు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ నటీనటుల బిజినెస్ కు హెల్ప్ అవుతోంది. ఈ రకంగానే మనోజ్ సినిమాలకు దూరం అవుతున్నారనే వార్తకు అతడు చెక్ పెట్టేశాడు.































