Manoj -Mounika: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ గత ఏడాది భూమ మౌనికను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహ వేడుకలు మంచు లక్ష్మి నివాసంలో ఎంతో ఘనంగా జరిగాయి. రెండో వివాహం తర్వాత మనోజ్ వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం భూమ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నారు అయితే తాజాగా ఈమెకు కవల పిల్లలు జన్మించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ మంచు మనోజ్ కొట్టి పారేశారు.
ఇకపోతే తాజాగా భూమా మౌనిక సీమంతపు వేడుకలు చాలా ఘనంగా జరిగాయని తెలుస్తుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నంద్యాలలో ఈమె సీమంతపు వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూమా నాగిరెడ్డి వర్ధంతి..
ఇటీవల భూమా నాగిరెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా మంచు మనోజ్ మౌనిక నంద్యాలకు వెళ్లి అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం తన కుటుంబ సభ్యులు ఈమెకు నంద్యాలలోనే సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.



























