భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించారు. సంక్షోభాలను గట్టేకించడంలో కృషి చేసిన పరిశ్రమల నాయకులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల సమాఖ్య 2021 వార్షిక సమావేశంలో మోది వర్చువల్గా పాల్గొన్నారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వలన భారతదేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ లో నమోదు అవడానికి దోహద పడింది మోది అన్నారు.
కంపెనీ స్వదేశానిది కాకపోయినా.. వాటి ఉత్పత్తులు మాత్రం భారత్లోనే తయారు కావాలనేదే తమ లక్ష్యమన్నారు. దేశంలో ప్రస్తుతం 60 యూనికార్న్ పరిశ్రమలు ఉన్నాయని.. అందులో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల్లోనే రికార్డ్ మార్క్ను అందుకున్నాయని మోదీ తెలిపారు.



































