Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైనప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల వేడుకలలో పాల్గొన్నాను అలాగే అబ్దుల్ కలాం గారు మా విద్యాసంస్థలకు వచ్చినప్పుడు కూడా ఆయనతో నేను మాట్లాడాను.అయితే ఇలా ఎంతోమంది పెద్ద వాళ్లతో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు ఇంత సమయం వరకే మాట్లాడాలని ఎవరు కండిషన్ పెట్టలేదు.

Mohan Babu: తక్కువ మాట్లాడమని చెప్పారు…
ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఇన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అంటూ నా కొడుకు విష్ణు నాకు కండిషన్ పెట్టారు అంటూ ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు. విష్ణు ఇలా చెప్పగానే ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది.అయినా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంది. కన్న బిడ్డలను కూడా పదిమందిలో పొగడకూడదు అంటారు అంటూ మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































