సినిమాలు చేసింది పదేళ్లే కానీ 70కిపైగా చిత్రాల్లో నటించింది. ఒకటి కాదు రెండు కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. అందం అందుకు తగ్గ అభినయం ఆమెకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవ్వరితోనైనా నవ్వుతూ మాట్లాడే వ్యక్తిత్వం. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అప్పట్లో తెలంగాణ నుంచి వచ్చిన రెండవ తెలుగు నటి. ఆమె అలనాటి మేటి నటి ముచ్చర్ల అరుణ. పదహారనాల అచ్చతెలుగు అమ్మాయి. 1965లో సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో జన్మించింది అరుణ. తన చదువంతా హైదరాబాద్లోనే సాగింది. చదువుతో పాటు కళలపైన ఇష్టంతో మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకుంది. అలా ఓసారి మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకులు భారతీరాజు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.
జేగంటలు మూవీతో అరంగేట్రం చేసి సీతాకోక చిలుకతో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి అరుణ. అలుపెరుగని బాటసారిగా నిరంతరం సినిమాలు చేస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పది సంవత్సరాల కాలంలో 70 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. సక్సెస్ మార్క్ను ను క్రియేట్ చేసుకుంది. 1981లో విడుదలైన సీతాకోకచిలుక చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది అరుణ. అప్పట్లో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించింది. అప్పటి టీనేజర్స్ అరుణ అంటే పడిచచ్చేవారు. సినిమాలంటే పెద్దగా తెలియని అరుణ మొదటల్లో కాస్త తటపటాయించింది.
ఆ తరువాత వచ్చిన అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుంది. ఆ తరువాత సినిమాల విషయంలో మంచి స్వింగ్లో ఉండేది. చాలా వరకు విజయవంతమైన సినిమాల్లో అరుణ కథానాయకిగాను కీలక పాత్రలు చేసింది. అప్పటిలో అరుణ చాలా బిజీ నటి . ఇక రామారావు గారితో జస్టిస్ చౌదరీ, సినిమాలో కూతురిగా నటించి అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. చిరంజీవి చంటబ్బాయి చిత్రంలోనూ చిరుకు అక్కగా నటించింది. స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, జేగంటలు, శ్రీవారికి ప్రేమలేఖ, శ్రీమతి ఒక బహుమతి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో మంచి నటనతో మెప్పించింది.
అప్పట్లో హిట్ రేస్ లో ఉన్న హీరోయిన్లకు సమానంగా అరుణ నటించేది. అయితే విజయశాంతి, రాధ, వంటి తారలు గ్లామర్ రోల్స్లోనూ ప్రేక్షకులను అలరించడంతో ఈ సీతాకోకచిలుక కాస్త వెనకబడిందనే చెప్పాలి. వారితో సమానంగా ముందుకు సాగలేకపోయింది. ఫ్యామిలీ హీరోయిన్ బ్రాండ్ పడటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది. కమర్షియల్ సినిమాలకు పనికిరాలేదు. అయితేనేం నటించిన 10 సంవత్సరాల్లో 70కిపైగా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.