Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

నన్ను చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు…
హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలి వచ్చాక సినిమాలు కాకుండా ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో శోభన్ బాబు గారి సలహాతో రియల్ ఎస్టేట్ వైపు అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు మాదాపూర్ ఇప్పుడున్న హైటెక్ సిటీ వద్ద ఆరు ఎకరాలు తీసుకొని వెంచర్ వేయాలని భావించారు. ఇక తెలుగుదేశంలో మారిన పరిస్థితుల కారణంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడంతో మురళీ మోహన్ గారు టీడీపీ లో చేరడం జరిగింది.

ఇక చంద్రబాబు సీఎం అయ్యాక చంద్రబాబు బినామీ మురళీ మోహన్ అంటూ విపక్షాల నుండి ఆరోపణలు వచ్చాయి. కోర్ట్ లో కేసులు కూడా వేశారట కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు. అయితే చంద్రబాబు కి నా భూమాలకు సంబంధం లేదని ఒకవేళ ఆరోపణలు నిజమైతే, భూముల కొనుగోలులో అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా కోర్ట్ లో నిరూపించబడితే నేను అసెంబ్లీ వద్ద ఉన్న చెట్టుకే ఉరి వేసుకుంటా అంటూ మురళీ మోహన్ ఛాలెంజ్ కూడా చేసారట.































