Actress Madhavi Reddy: తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి మాధవి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు సందడి చేస్తున్న మాధవి రెడ్డి హీరోయిన్ గా నటించారనే విషయం చాలామందికి తెలియదు.ఈమె తన కెరీర్ ప్రారంభంలో రెండు సినిమాలలో హీరోయిన్ పాత్రలో నటించానని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా మాధవి రెడ్డి మాట్లాడుతూ తాను ఆర్.నారాయణమూర్తి హీరోగా తెరకెక్కిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమాలో హీరోయిన్ గా నటించానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మాధవిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విశేషాల గురించి తెలియజేశారు. ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత హీరోయిన్ గా ఫిక్స్ చేసి, రెమ్యూనరేషన్ మాట్లాడిన తర్వాత నారాయణ మూర్తి గారు నెలరోజులపాటు మరే ప్రాజెక్టులలోను చేయకుండా కేవలం తన కోసమే పని చేయాలని కండిషన్ పెట్టారట

అప్పట్లో ఎన్నో సీరియల్స్ తోబిజీగా ఉన్నాను తప్పనిసరి పరిస్థితులలో అందరినీ రిక్వెస్ట్ చేసుకొని నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని మాధవి రెడ్డి తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఇక ఆయన షూటింగ్ సమయంలో ఎంతో సీరియస్ గా ఉండేవారని ఎవరైనా డైలాగ్ సరిగా చెప్పకపోతే వారి పై చేయి చేసుకునే వారని మాధవిరెడ్డి ఈ సందర్భంగా నారాయణ మూర్తి గురించి తెలియజేశారు.
ఆయనకు కోపం ఎక్కువ…
ఇక నారాయణమూర్తి సినిమాకు స్క్రిప్ట్ ఉండదని ఆయన ఏది చెబితే అది చేయాలని మాధవి రెడ్డి వెల్లడించారు. ఇక పోతే సినిమా షూటింగ్ సమయంలో ఎవరు ఎక్కువగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆయనకు ఎంతో కోపమని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నారాయణ మూర్తితో కలిసి నటించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా గురించి మాధవి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈమె మజిలీ, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో కూడా నటించారు.






























