వాతావరణంలో మార్పులు వస్తే.. ఎవరికైనా జలుబు చేయడం అనేది సహజం. కొందరికి ఆ జలుబు రావచ్చు.. లేకపోతే రాకపోవచ్చు. వీటినే సీజనల్ వ్యాధులు అని కూడా మనం పిలుచుకుంటాం. కొంతమందికి ఇలా జలుబుతో పాటు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే ఇవి వచ్చిన వెంటనే తగ్గవు. కొన్ని రోజుల వరకు సమయం తీసుకుంటాయి.

అవి ఉన్నంత సేపు ఎంతో బాధను కలిగిస్తాయి. ఏ పని చేయాలన్నా విసుగు పుడుతుంది. చలికాలంలోనే ఎక్కువగా ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది కనుక ఇవి రావడం సర్వసాధారణం. అయితే వీటిని మందులు నయం చేయలేకపోతే.. ఎన్ని వాడిననా తగ్గడం లేదు అని అనిపిస్తే.. ఇక్కడ ఒక చిన్న చిట్కాను వాడండి.
వెంటనే కాకున్నా.. కొంత సమయం తర్వాత అయినా ఉపశమనం కలుగుతుంది. దానికి ఇంట్లో దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది. దానిని దంచి పొడిగా చేసుకోవాలి. ఇంట్లో పొడిని మాత్రమే వాడండి.. దుకాణంతో దొరికే పొడిని మాత్రం వాడొద్దు. దీంతో పాటు కొంత తేనే, పసుపు కూడా అవసరం ఉంటుంది.
రెండు స్పూన్ల తేనె, చిటికెడు పసుపు, ఒక స్పూన్ దాల్చిన చెక్కను ఒక బౌల్ లో తీసుకొని అందులో వేయాలి. ఇలా వేసి.. ఆ మూడు పదర్థాలు బాగా కలిసే విధంగా తిప్పాలి. తర్వాత ఉదయం, సాయంత్రం ఆ మిశ్రమాన్ని కొంత గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు.. రోజూ రెండు పూటలు చేస్తే.. మీకు ఉపశమనం కలుగుతుంది.

































