నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టాక్ షోలో ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. మొదటి ఎపిసోడ్ కి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రశ్నలకు అదిరిపోయే మోహన్ బాబు సమాధానాలు అత్యంత ప్రేక్షకులకు ఈ కార్యక్రమంపై ఎంతో ఆతృతను కలుగజేస్తాయి.

ఇలా మొదటి ఎపిసోడ్ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా ఎవరు రాబోతున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు జరిగాయి.ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.
ఈ క్రమంలోనే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ వేదికపైకి రాగానే ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా రాబోయే వ్యక్తి మీ నుంచి వచ్చాడు అంటూ నానిని వేదికపైకి ఆహ్వానించాడు. అయితే అప్పటికి నాని రాకపోయేసరికి నాని ఎక్కడ అంటూ బాలకృష్ణ అడుగగా జనాల మధ్యలో నుంచి నాని వస్తూ మీరే కదా మీ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడంతో అక్కడి నుంచే వచ్చాను అంటూ నాని తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ నానితో ఎంతో సరదాగా మాట్లాడుతూ నీకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చా అంటూ ప్రశ్నించారు. దీంతో తనకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చని చెప్పడంతో బాలకృష్ణ కూడా తనకి క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టమని క్రికెట్ గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు వేదికపై క్రికెట్ ఆడి ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా నాని బాలయ్య చెప్పిన ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ తన డైలాగులను తనకే చెప్పారు. ఇక సాయంత్రం ఉయ్యాలకు నువ్వు ఎలా రిలాక్స్ అవుతావని బాలకృష్ణ నానిని అడగడంతో సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతానని చెప్పగా పులిహోర కథలు చెప్పకు అంటూ బాలకృష్ణ పంచ్ వేశారు. ఇలా మొత్తానికి వీరిద్దరి మధ్య ఎంతో సరదాగా ఈ ప్రోమో సాగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































